లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా మంత్రి

posted on: Oct 12, 2015 12:55PM


 

లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి ఓ మంత్రి తన పదవిని పొగొట్టుకున్నాడు. బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి అవధేశ్ కుశ్వాహ సింగ్ పై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి కొంత మంది విలేకరులు ఆయనకు నాలుగు లక్షల రూపాయలు ఇవ్వగా మంత్రి ఈ డబ్బును తీసుకుంటూ పట్టుబడ్డారు. దీంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వెంటనే ఆయనను పదవినుండి తప్పించారు. కాగా ఎన్నికల ముందు జరిగిన ఈ ఘటనతో జెడియు కొంత ఇబ్బంది లో పడింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...