Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బిహార్ 4వ దశ ఎన్నికలలో ఒంటి గంటకి 42.94 శాతం పోలింగ్
posted on: Nov 1, 2015 1:53PM
.jpg)
బిహార్ నాల్గవ దశ పోలింగ్ ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా సజావుగా సాగుతోంది. మహ్యాహ్నం ఒంటి గంటకు 42.94 శాతం ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల కమీషన్ ప్రకటించింది. ఈరోజు జరుగుతున్న 55 సీట్లకు మొత్తం 776 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. వారిలో 57మంది మహిళా అభ్యర్దులున్నారు. వారిలో ఎన్డీయే కూటమి తరపున 51మంది, జనతా పరివార్ తరపున 55 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. ముజఫ్ఫర్ నగర్, సివాన్, షియోహర్,సీతామార్గ్, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్ మరియు గోపాల్ గంజ్ జిల్లాలలో నేడు పోలింగ్ జరుగుతోంది. ఏడు జిల్లాలలో మొత్తం 1,46,93,294 మంది ఓటర్లున్నారు. వారిలో 42.94 శాతం మంది ఓటర్లు ఇంతవరకు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఉదయం ఏడు గంటలకి మొదలయిన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకి ముగుస్తుంది. నక్సల్స్ ప్రభావితం ఉన్న 8 నియోజక వర్గాలలో మాత్రం పోలింగ్ 3 గంటలకే ముగుస్తుంది. బిహార్ అసెంబ్లీలో ఉన్న మొత్తం 247 సీట్లున్నాయి. ఈరోజుతో 186 సీట్లకు పోలింగు పూర్తవుతుంది. మిగిలిన 57 సీట్లకు నవంబర్ 5న ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 8న ఓట్ల లెక్కింపు చేసి అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారు.



.jpg)


