వైఎస్సార్సీపీ ఉన్నది జాగ్రత్త... చంద్రబాబు!

posted on: Sep 28, 2024 5:21PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేగంగా వ్యాప్తి చేయాలని అనుకుంటున్న అబద్ధాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులను హెచ్చరించారు. ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన వైఎస్సార్సీపీ చేస్తున్న అబద్ధాల ప్రచారాన్ని తిప్పికొట్టడానికి అనుసరించాల్సిన వ్యూహం మీద పలు సూచనలు చేశారు. మనం ప్రజలకు వాస్తవాలు చెప్పే లోపు జగన్ అబద్ధాలను భారీ స్థాయిలో ప్రచారం చేయాలని చూస్తున్నారని చంద్రబాబు హెచ్చరించారు. ప్రభుత్వం - పార్టీ సమన్వయంతో పనిచేసి జగన్ కుట్రలను సమర్థంగా తిప్పికొట్టాలని చంద్రబాబు సూచించారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...