Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఈఫుడ్స్ తో నెలసరి ఇబ్బందులకు చెక్!
posted on: Nov 27, 2023 12:09PM
ప్రతి ఆడపిల్లకూ నెలసరి తప్పనిసరి. ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, పోషకాహారలోపం వంటి కారణాలతో అధిక రక్తస్రావం, కడుపునొప్పి, తీవ్ర భావోద్వేగాలు వంటికి కనిపిస్తుంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. అవేంటో చూద్దామా.
ఆకు కూరలు:
ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలు ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటాయి. వీటిని ఈ సమయంలో తింటే నొప్పులు తగ్గుతాయి. రక్తహీనత సమస్య అదుపులో ఉంటుంది. ఇందులోని మెగ్నీషియం మెదడుకి ఉపశమనం కలిగిస్తుంది.
అరటిపండ్లు:
ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇందులోని పొటాషియం ఒంట్లోని నీటిని నిల్వల్ను కోల్పోకుండా చేయడంతో డీహైడ్రేషన్ సమస్య ఎదురుకాదు. అంతేకాదు అరటిలో ఉండే ట్రిప్టోఫాన్ సెరటోనిన్ విడుదల చేస్తుంది. ఇది మెదడుకు ఉపశమనం అందిస్తుంది.
డార్క్ చాక్లెట్ :
నెలసరి సమయంలో ఒంట్లోని ప్రొజెస్టెరాన్ హార్మోన్ తగ్గడంతో ఈస్ట్రోజన్ పెరుగుతుంది. దీంతో ఒంట్లో చక్కెర స్థాయిలు తగ్గి నీరసం పెరుగుతుంది. దీంతో తీపి తినాలన్న కోరిక పెరుగుతుంది. ఇలాంటి సమయంలో డార్క్ చాక్లెట్ తినండి.
పెరుగు:
చాలామంది నెలసరి సమయంలో పెరుగు తినకూడదని చెబుతుంటారు. కానీ ఇది ఆ సమయంలో మంచి ఆహారమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఇందులో ఉండే కాల్షియం, పొత్తికడుపు నొప్పిని తగ్గించి, మూడ్ స్వింగ్స్ కి దూరంగా ఉంచుతుంది.






