టిడిపి నుంచి రాజ్యసభ సభ్యులుగా బీద మస్తాన్ రావ్ ?
posted on: Dec 9, 2024 3:12PM
ఎపిలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వైఎస్ ఆర్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులైన బీద మస్తాన్ రావ్ ఈ నెల 9న (సోమవారం) తెలుగుదేశం గూటికి చేరుతున్నారు. ఇటీవల వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేతలు టిడిపి, జనసేన, బిజెపిలో చేరుతున్నారు. వారిలో ఆర్ కృష్ణయ్య ఒకరు. ఆయన వైసీపీ రాజ్యసభ సభ సిట్టింగ్ ఎంపీ. రెండోసారి కూడా వైసీపీ నుంచి టికెట్ వచ్చే అవకాశాలున్నప్పటికీ ఆయన బిజెపిలో చేరి రాజ్యసభ సీటు రెండో సారి దక్కించుకున్నారు. బీద మస్తాన్ రావ్ కూడా వైసీపీ రాజ్య సభ సిట్టింగ్ ఎంపీ. ఈయనకు కూడా రెండోసారి కూడా ఆ పార్టీ నుంచి టికెట్ వచ్చే అవకాశమున్నప్పటికీ స్వంత పార్టీ అయిన దేశం గూటికి చేరడం ఆసక్తికరం. ఈయన కూడా రెండో సారి రాజ్యసభ సీటు టిడిపి నుంచి దక్కించుకునే అవకాశం ఉంది. బీద మస్తాన్ రావ్ కు ఇంకా నాలుగేళ్లు పదవీకాలం ఉన్నప్పటికీ ఆయన వైసీపీకి రాజీనామా చేసారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ సిట్టింగ్ రాజ్య సభసభ్యులు మోపిదేవి వెంటరమణ తన పదవికి ఇంకా రెండేళ్లు ఉన్నప్పటికీ నవంబర్ 9న టిడిపిలో చేరనున్నారు.



.webp)


