బాలయ్య, గల్లాపై వీర్రాజు ఫైర్

 

టీడీపీ నేతలు బాలకృష్ణ, గల్లా జయదేవ్ పై ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు మండిపడ్డారు, కేంద్రంపైనా, మోడీపైనా ఇష్టమొచ్చినట్లు అవాకులు చవాకులు పేలితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మోడీపై బాలకృష్ణ, గల్లా జయదేవ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్న ఆయన... ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిందించొద్దని సూచించారు, టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తాము కూడా అలాగే మాట్లాడాల్సి వస్తుందని, అవసరమైతే పదవులను సైతం వదులుకుని టీడీపీ సర్కార్ పై విమర్శలు చేస్తామని అల్టిమేటం ఇచ్చారు, మిత్రపక్షమైనందుకే టీడీపీపై తాము విమర్శలు చేయడం లేదని, అయితే అవినీతి జరిగితే మాత్రం కచ్చితంగా ప్రశ్నిస్తామని అన్నారు.