తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తాం.. బలరాం సంచలన వ్యాఖ్యలు

posted on: Oct 10, 2015 11:44AM

 

రాజకీయ నాయకులు అప్పుడప్పుడు ప్రసంగాల్లో ఆవేశంతో కొన్ని మాటలు మాట్లాడి పార్టీకి తంటాలు తీసుకొస్తుంటారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేత మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ కూడా చేసింది అలాగే ఉంది. వరంగల్ జిల్లా నర్సంపేటంలో కాంగ్రెస్ నేతలు ఓసమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జానారెడ్డి.. ఉత్తమ్ కుమార్ రెడ్డితో, బలరాం నాయక్ తోపాటు ఇతర సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే మీరు టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టారని.. ఈసారి కనుక కాంగ్రెస్ ను గెలిపించకపోతే తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తామని నోరు జారారు. అంతే బలరాం చేసిన వ్యాఖ్యలకు పార్టీ నేతలు ఒక్కసారిగా షాకయ్యి.. ఏం మాట్లాడుతున్నావని బలరాం ను హెచ్చరించారు. దీంతో బలరాం తేరుకొని జస్ట్ జోక్ చేశా అంటూ కవర్ చేసుకున్నారు. అయితే ఒకసారి నోరు జారిన తరువాత ఆమాటలు వెనక్కి రావు కదా.. ఇప్పుడు బలరాం చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. దొరికిందే ఛాన్స్ కదా అని కాంగ్రెస్ పై నిప్పులు చెరుగుతున్నారు. కేంద్ర నాయకత్వం చేస్తున్న కుట్రులను బలరాం మాటల్లో అర్థమవుతుందని అంటున్నారు. ఈ ఒక్క మాట చాలు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కుట్రలు చేస్తుందో అంటూ ఒంటి కాలు మీద లేస్తున్నారు. అసలే అంతంత మాత్రం ఉన్న కాంగ్రెస్ ఉనికికి బలరాం వ్యాఖ్యలతో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో.

google-ad-img
    Related Sigment News
    • Loading...