Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బాలయ్యతో చేయడం లేదు: త్రిష
posted on: Jun 21, 2013 7:57PM
.jpg)
నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటిల 'సింహ' సూపర్ హిట్ తరువాత మళ్ళీ ఈ కాంబినేషన్లో మరో సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి ఇప్పటి వరకు హీరోయిన్లను ఎంపిక చేయకపోవడంతో రకరకాల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. లేటెస్ట్ గా త్రిష పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా త్రిషను తీసుకున్నట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో...త్రిష ట్విట్టర్ లో ఈ వార్తలపై స్పందించింది.
ప్రస్తుతం తాను తెలుగులో కానీ తమిళ్ లో ఏ సినిమాకు సైన్ చేయలేదని, గతంలో ఒకే చేసిన ప్రాజెక్ట్ లతోనే బిజీగా ఉన్నానని వివరణ ఇచ్చింది. దీంతో ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే సస్పెన్స్ కొనసాగుతునే ఉంది. ఈ సినిమా దుబాయ్లో షెడ్యూల్ తో మొదలుకానుందని సమాచారం. అక్కడ ఎడారిలో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయికొర్రపాటి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.






