తెలంగాణలో అధికారంలోకి వస్తాం.. బాలకృష్ణ

తెదేపా 34వ మహానాడు కార్యక్రమం రెండోరోజు సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తనదైన శైలిలో ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో అన్ని పార్టీలను ఏకతాటిపై తెచ్చిన నేత ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ పాలనలోనే ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని, జాతీయ రాజకీయాల్లో ఆయన ప్రభావం చూపించారని అన్నారు. ఈ రోజు బడుగు బలహీన వర్గాలు అధికారంలో ఉన్నాయంటే అది ఎన్టీఆర్ చలవేనని, వాళ్లను అధికారంలోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌దే నని వెల్లడించారు. చాలా దారుణంగా ఒక్కటిగా ఉన్న రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టారని, విభజన తరువాత రాష్ట్రాన్నికాపాడగలిగేది ఒక్క చంద్రబాబు మాత్రమే అని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.