రాం జెఠ్మలానీకి రాంరాం చెప్పండి...

 

కర్ణాటక హైకోర్టులో తన తరపున వాదించిన లాయర్ రాం జెఠ్మలాని నిర్లక్ష్యం కారణంగానే తాను జైల్లో గడపాల్సిన వస్తోందని, అందువల్ల అతన్ని లాయర్‌గా తొలగించి ఆయన స్థానంలో హరీష్ సాల్వేని లాయర్‌గా పెట్టాలని తన అనుచరులను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదేశించారు. ఇదిలా వుండగా జయలలిత తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. కర్ణాటక హైకోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించడం మీద వారు ఈ పిటిషన్ దాఖలు చేయనున్నారు. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే సమయంలో హరీష్ సాల్వేతో వాదనలు వినిపించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా జయలలిత తన అనుచరులకు స్పష్టంగా చెప్పారు. జయ ఆదేశాల ప్రకారమే గురువారం నాడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu