బాగ్దాద్ కారు బాంబు పేలుడు...చేసింది మేమే..

posted on: May 11, 2016 5:00PM

 

ఇరాక్ రాజధాని బాగ్దాద్లో మరోసారి ఉగ్రవాదులు హింసాత్మక ఘటనకు పాల్పడ్డారు. కారు బాంబు దాడి చేసి కొన్ని ప్రాణాలను బలిగొన్నారు. బాగ్దాద్ లోని ముస్లింలు అధికంగా ఉండే సాద్ర్ లో కారు బాంబు పేలి 64 మంది మృతి చెందగా 87 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో మహిళలు, చిన్నపిల్లలు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. మార్కెట్లోకి కూరగాయలు, పండ్లతో వచ్చి ఒక వాహనం ఆగిందని..అందులో దిగిన వ్యక్తి వాహనాన్ని అక్కడే వదిలేసి హడావుడిగా వెళ్లిపోయాడని.. ఆతరువాత బాంబు పేలిందని సాక్ష్యులు పోలీసులకు తెలియజేశారు. కాగా, ఈ సంఘటనకు తామే బాధ్యులమంటూ ఐఎస్ ఉగ్రవాదులు ఒక ఆన్ లైన్ ప్రకటన చేశారు.

 

google-ad-img
    Related Sigment News
    • Loading...