Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...'బాద్షా' ఆడియో: కన్నీళ్లు పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్
posted on: Mar 18, 2013 4:16PM

‘బాద్ షా’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. అంతలోనే ఒక విషాద వార్త. వరంగల్ జిల్లా కరీమాబాద్ బీరన్న కుంటకు చెందిన మక్కల రాజు (20) ఆడియో విడుదల కార్యక్రమం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఊపిరాడక మృతిచెందాడు. పాపం జూనియర్ ఎన్టీఆర్ వేదిక మీదనే కన్నీళ్లు పెట్టుకున్నారు. తోబుట్టువును పోగొట్టుకున్నానని బాధపడ్డారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. అభిమానులు వారి కుటుంబ సభ్యులను గుర్తు పెట్టుకోవాలని, క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. నిర్మాత బండ్ల గణేష్ ఉడతాభక్తిగా ఆ కుటుంబానికి తాను రూ. 5 లక్షలు ఆర్ధిక సహాయం చేస్తున్నానని ప్రకటించారు. డబ్బులెన్ని ఇచ్చినా ఆ కుటుంబానికి కొడుకు లేని లోటు పూడ్చలేమని అన్నారు.






