కోడలి మరణవార్త విని అత్త మృతి

కోడలి మరణవార్త విని అత్త గుండెపోటుతో మరణించిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి మండలం రాజానగరం గ్రామంలో జరిగింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చెంగమ్మ (40) అనే మహిళ ఆదివారం నాడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె మృతదేహాన్ని ఆదివారం మధ్యాహ్నానికి రాజానగరం గ్రామానికి తరలించారు. కోడలి మృతదేహాన్ని చూసిన వెంటనే ఆమె అత్త గిరమ్మ (70) గుండెపోటుకు గురై అక్కడికక్కడే మరణించింది. అత్తాకోడళ్ళు ఒకేసారి మరణించడంతో ఆ ఇంట్లో విషాదం కమ్ముకుంది. ఈరోజుల్లో కూడా ఇంత అన్యోన్యంగా వుండే అత్తాకోడళ్ళు వుండటం విశేషమేనని పలువురు అనుకుంటున్నారు.