Latest News

చిలుకూరుబాలాజీ దేవాలయ అర్చకుడు రంగరాజన్ పై దాడి 

posted on: Feb 9, 2025 4:25PM

చిలుకూరు బాలాజీ దేవాలయ  అర్చకుడు రంగ రాజన్ పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. వాళ్లు దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజిలో రికార్డయ్యాయి. రంగరాజన్ పై దాడికి పాల్పడటాన్ని టెంపుల్ ప్రొటెక్షన్ మూవ్ మెంట్ కన్వీనర్  ఎంవీ సౌందర్యరాజన్ ఖండించారు. తన కుమారుడిపై దాడి చేసిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు.   రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. చిలుకూరు బాలాజీ దయతో తన కుమారుడి  ప్రాణాలకు ఎలాంటి ఆపాయం జరగలేదని సౌందర్యరాజన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...