అంతా మోడీ ఫలితమే.. అరుణ్ జైట్లీ

ఎన్డీఏ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసిన సందర్భంగా ఢిల్లీలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంవత్సర పాలనలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన లక్ష్యాలను వివరించారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల వరుసలో భారత్ చేరిపోయిందని, ఇతంతా మోడీ శ్రమ ఫలితమేనని ఆయన వ్యాఖ్యానించారు. దేశాన్ని ఇంకా అభివృద్ధి చేసేందుకు మోడీ ఏడాదిలో 18 దేశాలు పర్యటించారని తెలిపారు. ఇంకా... ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని పెంచామని, ఆర్ధిక లోటును తగ్గించడంలో విజయం సాధించామని అరుణ్ జైట్లీ వివరించారు.