జపాన్‌లో బాపు కుమారుడు

posted on: Aug 31, 2014 6:59PM

 

ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు బాపు కన్నుమూశారు. బాపు మరణం ప్రతి ఒక్క తెలుగువారికి మనోవేదన కలిగిస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమలోని అనేకమంది బాపు మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తంచేస్తున్నారు. అనేకమంది బాపుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. బాపు గారికి ఇద్దరు సంతానం. ఒక కుమార్తె, ఒక కుమారుడు. తన కుమార్తెని తన స్నేహితుడు ముళ్ళపూడి వెంకటరమణ కుమారుడు వర ముళ్ళపూడికి ఇచ్చి వివాహం చేశారు. అలా తమ స్నేహబంధాన్ని బంధుత్వంగా మలచుకున్నారు. ముళ్ళపూడి వర ‘విశాఖ ఎక్స్ ప్రెస్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. బాపు కుమారుడు ప్రస్తుతం జపాన్‌లో వున్నారు. ఆయన సోమవారం చెన్నైకి తిరిగి రానున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...