ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

posted on: Feb 21, 2013 10:13AM

 

 

 Arrangements in place for MLC poll, Andhra Pradesh MLC Elections, MLC Elections Polling Today

 

 

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 14 జిల్లాలో ఆరు స్థానాలకు జరిగే ఈ ఎన్నికల్లో 6.32 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించకోనున్నారు. ఎన్నికల కోసం 1437 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టభద్రుల స్థానాలకు 64 మంది, ఉపాధ్యాయ స్థానాలకు 19 మంది పోటీపడుతున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.


ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ లైవ్ వెబ్‌కాస్టను అధికారులు ఏర్పాటు చేశారు. ఓటరు గుర్తింపు కార్డులు లేని వారు ఫోటోతో ఉన్న 15 రకాల గుర్తింపు కార్డులను చూపి ఓటు వేయవచ్చు. ఎన్నికల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఆరుగురు ఐఎఎస్ అధికారులను ఈసీ నియమించింది. ప్రత్యేక పోలీసు బలగాలు, మొబైల్ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ చెప్పారు. 25న ఉదయం 8 గంటలకు ఆరు కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగనుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...