పాక్ కాల్పులు.. భారత సైన్యాధికారి మృతి

 

పాకిస్థాన్ కు ఒప్పందాలు ఉల్లంఘించడం కొత్తేమి కాదు. ఈసారి కూడా కాల్పుల విరమణ బప్పందం ఉల్లఘించి భారత సైన్యంపై కాల్పులు జరిపింది. నౌగామ్ సెక్టార్‌లో ఎల్‌ఓసీ వద్ద పాక్ బలగాలు భారత సైన్యంపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పులలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ చనిపోయారు. అంతేకాదు పీర్ పంజాల్ వద్ద కూడా భారత ఔట్ పోస్టులపై పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతున్నారు. కాగా రెండు దేశాల ఆర్మీ, డీజీలు సెప్టెంబర్ మొదటి వారంలో చర్చలు జరుపనున్న నేపథ్యంలో పాక్ కాల్పులు ఉధృతం చేసింది.