Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రేట్లు పెంచకుండా ప్రత్యేక బస్సులు!
posted on: Oct 1, 2024 1:10PM

దసరా సందర్భంగా ప్రయాణీకుల రద్దీని తట్టుకునేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల నుంచి ప్రయాణీకులకు ఎటువంటి ఇబ్బందీ తలెత్తకుండా ఈ నెల 4 నుండి 20 వరకు మొత్తం 6,100 బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రయాణికులపై భారం మోపకుండా సాధారణ ఛార్జీలతోనే ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. అలాగే ఏపీఎస్ఆర్టీసీలో కొత్తగా ప్రవేశ పెట్టిన యూటీఎస్ మెషీన్లతో చిల్లర సమస్య కూడా తలెత్తదు. ఫోన్ పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్ స్కాన్ , క్రెడిట్, డెబిట్ కార్డుల స్వైపింగ్ ద్వారా కూడా టిక్కెట్లు తీసుకుని ప్రయాణం సాగించే వీలుంది. ముందస్తుగా సీటు వివరాలు చెక్ చేసుకుని బస్సులను ఎంచుకునే అవకాశం కూడా ఉందని ఆర్టీసీ పేర్కొంది.






