Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...'ఆప్' నుంచి గెంటేశారు...
posted on: Mar 28, 2015 1:28PM

ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రాకముందు అంతా బానే ఉన్నా, అధికారంలోకి వచ్చిన తరువాతే అసలు సమస్య మొదలైంది. ఆ పార్టీలో వాళ్లలో వాళ్లకే విభేదాలు తలెత్తాయి. ఈ వ్యవహారంలో ప్రశాంత్ భూషణ్, యోగేంద్రయాదవ్ లు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. అయితే శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాగా ఈ సమావేశంలో ప్రశాంత్ భూషణ్, యోగేంద్రయాదవ్ లు పాల్గొనలేదు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ సమావేశం అనంతరం ఆ ఇద్దరిని పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఢిల్లీలోని ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ప్రశాంత్, యోగేంద్ర మద్ధతు దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






