సమ్మె కొనసాగిస్తాం

posted on: Sep 12, 2013 9:06AM

 

ఈ నెల 16న సీమాంద్ర ఉద్యోగుల సమ్మెకు సంభందించి కోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో, ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు తన కార్యాచరణ ప్రకటించారు. కోర్టు తీర్పు ఎలా ఉన్న సమ్మె విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. కేసులకు నిర్భందాలకు భయపడే ప్రసక్తే లేదని తేల్చారు.

హైకోర్టుతో వచ్చిన తీర్పు తమకు వ్యతిరేఖంగా ఉంటే ఆ తీర్పును సుప్రిం కోర్టుతో సవాల్‌ చేస్తామన్నారు. ఏపీఎన్జీవో సంఘం నేతలతో కలిసి బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. 16 కోర్టు ఇచ్చే తీర్పు తమకు వ్యతిరేఖంగా వచ్చే అవకాశాలే ఎక్కువన్నారు.

హైకోర్టు వద్ద న్యాయవాదులు మధ్య జరిగిన గొడవను ఆయన ఖండించారు. శాంతియుతంగా చేపట్టిన సీమాంద్ర న్యాయవాదుల మానవహారాన్ని తెలంగాణవాదులు అడ్డుకోవడాన్ని ఆయన ఖండిచారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...