TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అబ్దుల్ కలాం రాష్ట్రపతి.. చంద్రబాబు ముఖ్యపాత్ర

Published on: Tue Jul 28, 2015 2:49PM

 

భారతదేశపు ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త అబ్దుల్ కలాం అనారోగ్యం కారణంగా మృతి చెందారు. భారత మిస్సైల్ మాన్ పిలవబడే కలాం దేశానికి ఎనలేని కృషి చేశారు. కలలకు అర్ధం చెప్పి.. కలలు కనండి.. నిజం చేసుకోండి అంటూ పిల్లలకు, యువతలో స్ఫూర్తినింపారు అబ్దుల్ కలాం. తన జీవితంలో ఎవరూ పొందలేని అరుదైన అవార్డులు ఎన్నేన్నో పొందారు. అబ్దుల్ కలాం సాంకేతిక రంగంలోనే కాదు అటు రాజకీయ రంగంలో కూడా రాష్ట్రపతిగా తన పాత్రకు న్యాయం చేశారు. ఒక రకంగా అబ్దుల్ కలాం రాష్ట్రపతి అవడానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబే ముఖ్యభూమిక పోషించారని చెప్పవచ్చు. అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎన్డీయే కన్వీనర్‌గా ఉన్నారు. ఆసమయంలో వాజపేయి భారత ప్రధానిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే అప్పుడు వాజపేయి భారత రాష్ట్రపతిగా మైనార్టీ వర్గానికి చెందిన ప్రముఖుడిని నియమించాలని తీర్మానించారు. దీనిలో భాగంగానే ముగ్గురు మైనార్టీ నేతల పేర్లను తీసి ఎన్డీయే కన్వీనర్ హోదాలో ఉన్న చంద్రబాబును సంప్రదించినప్పుడు చంద్రబాబు అబ్దుల్ కలాం పేరును సూచించారట. ఈ నేపథ్యంలో అబ్దుల్ కలాంను కూడా నో చెప్పవద్దని బాబు ఒప్పించారట.