Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చంద్రబాబు తాకట్టు పెడుతున్నారు. జగన్
posted on: May 10, 2016 3:09PM

ఏపీలో ప్రత్యేక హోదాపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ధర్నాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నిర్వహిస్తోన్న ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు. బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేశారని, నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారని ఆయన అన్నారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాలకోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని జగన్ ఆరోపించారు. కులాలు, మతాల పేరుతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా వస్తేనే ఉద్యోగాలు వస్తాయని, రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. చంద్రబాబు వెన్ను పోటు వల్లే ప్రత్యేక హోదా రావడం లేదని జగన్ వ్యాఖ్యానించారు.






