తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తారా? అచ్చెన్నాయుడు

హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాలని శాంతి భద్రతలను గవర్నర్ చేతికి అప్పగించాలని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అలా కాని పక్షంలో హైదరాబాద్ ను యూటీ చేయాలని తాము డిమాండ్ చేస్తామని చెప్పారు. సెక్షన్ 8 అమలు చేస్తే దీక్షలు చేస్తామని అంటున్నారు.. అలా దీక్షలు వల్ల చట్టాలు మారిపోతే లక్షలమందితో నిరాహార దీక్ష చేస్తామని ఎద్దేవ చేశారు. ఒకవేళ సెక్షన్ 8 కనుక లేకపోతే విభజన చట్టం తీసేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలిపేస్తారా అని సవాల్ విసిరారు. హైదరాబాద్ కేసీఆర్ సొత్తు కాదని.. హైదరాబాద్ పై వారికి ఎంత హక్కు ఉందో.. మాకు కూడా అంతే హక్కు ఉందని.. పదేళ్ల తరువాత కాదు కదా పది నిమిషాల ముందు కూడా హైదరాబాద్ ను విడిచి వెళ్లమని స్పష్టం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu