అవి అస్సలు పట్టించుకోను.. బాలకృష్ణ

posted on: Aug 19, 2015 12:54PM


 

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ రోజు సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడిని కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటాయి అది సాధారణం.. వారి విమర్శలను అస్సలు పట్టించుకోనని అన్నారు. పస్తుతానికి హిందూపురం అభివృద్దే తన లక్ష్యమని అన్ని రంగాల పరంగా హిందూపురాన్ని అభివృద్ధి పరిచే దిశగా ప్రణాళిక సిద్దం చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే హిందూపురానికి నీళ్లు తీసుకు వస్తానని చెప్పారు. ఒక్క హిందూపురాన్నే కాకుండా అనంతపురం అభివృద్ధిపైన కూడా కృషి చేస్తానని తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...