ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్

posted on: Jul 14, 2025 9:30PM

 

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన మద్రాసు హైకోర్టు జడ్జిగా ఉన్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. ఆయన గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2023లో ఏపీ నుంచి మద్రాసుకు బదిలీ కాగా.. ప్రస్తుతం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 

ఏపీతో పాటు మరిన్ని రాష్ట్రాలకు కొత్త సీజేఐలు నియమించబడ్డారు. తెలంగాణ హైకోర్టు సీజేగా అపరేష్‌కుమార్‌ సింగ్, త్రిపుర హైకోర్టు సీజేగా ఎంఎస్ రామచంద్రరావు, రాజస్థాన్ హైకోర్టు సీజేగా కేఆర్ శ్రీరామ్ నియమితులయ్యారు.  ఈయన ఆంధ్రా యూనివర్సిటీ లా కాలేజ్ నుంచి బీఎల్ పూర్తి చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...