ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల..


ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణు గోపాల్ రెడ్డి పరీక్షా ఫలితాలు విడుదల చేశారు. ఈ నెల 9వ తేదీన ఈ పరీక్షకు 34,739 మంది విద్యార్ధులు హాజరుకాగా.. వీరిలో 33, 535 మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. ఏయూ రిజియన్ లో 25,335 మంది విద్యార్ధులు హాజరుకాగా.. వారిలో 24,414 మంది అర్హత సాధించారు. ఇంకా ఎస్వీయూ రీజియన్ నుండి 8,560 మంది విద్యార్ధులు హాజరు కాగా వారిలో 8,297 మంది.. ఇతర రీజయన్‌లు నుండి  844 మంది విద్యార్దులు హాజరుకాగా 824 మంది అర్హత సాధించారు.