Latest News

చంద్రబాబు శ్రీకాకుళం పర్యటన వాయిదా

posted on: Oct 9, 2014 10:43AM

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించాల్సి వుంది. అయితే ఉత్తరాంధ్రకు తుఫాను వచ్చే అవకాశం వున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పర్యటన వాయిదా పడింది. తిరిగి చంద్రబాబు ఈనెల 17వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు. తుఫాను నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు. 11 తీర మండలాలలో నిత్యావసర వస్తువులు సిద్ధం చేసుకోవాలని, ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుండాలని ఆదేశాలు జారీ చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...