పుష్కర ఏర్పాట్లను పరిశీలించనున్న ముఖ్యమంత్రి

posted on: Jun 25, 2015 8:18AM

 

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఉభయగోదావరి జిల్లాలలో పర్యటిస్తారు. ముందుగా రాజమండ్రిలో గోదావరి నది వద్ద జరుగుతున్న పుష్కర ఏర్పాట్లను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు సూచనలు, సలహాలు ఇస్తారు. తరువాత గోదావరి నాలుగవ వంతెనపై జరుగుతున్న పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరులో జరుగుతున్నా పుష్కర పనులను పరిశీలిస్తారు. సాయంత్రం రెండు జిల్లాలకు చెందిన అధికారులతో సమావేశమయ్యి పుష్కర ఏర్పాట్లను సమీక్షిస్తారు. రాత్రికి విజయవాడ చేరుకొని అక్కడే బస చేస్తారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...