TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చెప్పినట్టే చేశాం... చంద్రబాబు

Published on: Fri May 1, 2015 12:49PM

 

తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాకినాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కాకినాడ లో టూరిజం పార్క్ కు శంకుస్థాపన చేశారు. టూరిజం వల్లే జిల్లా అభివృద్ధి సాధ్యమని అన్నారు. దేశానికి అన్నం పెట్టిన జిల్లా తూర్పుగోదావరి జిల్లా అని అన్నారు. కాకినాడపై టీడీపీకి ఎప్పుడూ ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుందని, కాకినాడలో పోర్టుల అభివృద్ధి జరగాల్సి ఉందని అన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పాం... చెప్పినట్టు చేసి చూపించాం అన్నారు. అనంతరం రాజమండ్రిలో నిర్వహించనున్న మేడే కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.