ఏపీ రవాణా మంత్రికి చంద్రబాబు ఫోన్

 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఆర్టీసీ ఉద్యోగులు తమ వేతన సవరణ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు కూడా 43శాతం ఫిట్ మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేపట్టారు. దీంతో రెండు రాష్ట్రాలలో ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. ఈ కారణంగా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంపై ఏపీ రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావుతో ఫోన్ లో మాట్లాడారు. అయితే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని శిద్దా తెలిపారు. అవసరమైతే రైల్వేశాఖతో మాట్లాడి ప్రత్యేక రైళ్లు నడిచేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం.