Latest News

చంద్రబాబుకు హైకోర్టులో "చుక్కె"దురు...

posted on: Apr 28, 2016 1:16PM

 

ఏపీ సర్కార్ కు హైకోర్టులో చుక్కెదురైంది. మద్యం పాలసీలో ఏపీ సర్కార్ ఎంచుకున్న కొత్త మార్గాన్ని హైకోర్టు నిలిపేసే దిశగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. గతంలో మద్యం పాలసీ ప్రకారం ఎవరు ఎక్కువ ధర ఇచ్చేందుకు ముందుకు వస్తే వారికి అవకాశం దక్కేది. దీనివల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయం బాగానే వచ్చేది. అయితే ఈ పద్దతిని మార్చే దిశగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ఫస్ట్ కం... ఫస్ట్ సర్వ్’ పేరిట... ఎవరు ముందుగా వస్తే వారికే బార్లను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగానే కొత్త మద్యం పాలసీకి రూపకల్పన చేసి జీవో నెం:19ను జారీ చేసింది. అయితే దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలవ్వగా.. నేడు విచారించిన హైకోర్టు జీవోను నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...