తెలంగాణకు వ్యతిరేకం కాదు.. చంద్రబాబు
posted on Jun 2, 2015 5:47PM

రాష్ట్రాలు విడిపోయినా తెలుగు ప్రజల్లో ఎలాంటి విభేదాలు లేవని విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరు రాష్ట్రాలు ఇచ్చుపుచ్చుకునే ధోరణితో ముందుకు సాగాలని అలాగైతేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. అంతేకాక నవనిర్మాణ దీక్ష తెలంగాణకు వ్యతిరేకం కాదని, తెలంగాణలో ఉన్న సమస్యలపై కూడా పోరాటం చేస్తామని అన్నారు. ప్రత్యేక హోదా గురించి ప్రస్తావిస్తూ కేంద్ర ఇచ్చే ఒక్క ప్రత్యేక హోదాతో ఏపీ అభివృద్ధి అసాధ్యమని ఏపీ ఆభివృద్దికి కేంద్రం తప్పకుండా సహకరించాలని కోరారు. ఏపీ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడతానని అందుకు తెలుగు ప్రజలు తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.