Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏపీ రాజధాని ముహూర్తం బాలేదని హెచ్చరిక
posted on: May 18, 2015 3:23PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణానికి జూన్ 6వ తేదీన శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 6వ తేదీన ఉదయం 8.49 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ చేయనున్నారు. మరోవైపు చంద్రబాబు అధికారం చేపట్టి జూన్ 8 నాటికి ఏడాది కావడంతో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన స్థలంలోనే బహిరంగసభ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇదిలా ఉండగా నూతన రాజధాని నిర్మాణానికి పెట్టిన ముహూర్తం సరిగా లేదని ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీనివాస గార్గేయ అన్నట్లు తెలుస్తోంది. గోదావరి పుష్కరాల ముందు ముహుర్తాలు ఆశించినంత ఫలితాలు ఇవ్వవని, పుష్కరాలు ప్రారంభమైన 70 రోజుల తరువాత ముహుర్తాలు బావుంటాయని చెప్పినట్టు సమాచారం. ఒకవేళ జూన్ 6వ తేదీనే భూమి పూజ నిర్వహిస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు.






