చంద్రబాబు చేతికందిన 'రాజధాని మాస్టర్ ప్లాన్'

సోమవారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యంమంత్రి చంద్రబాబు నాయుడు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ భేటీ అయ్యారు. మంత్రి ఈశ్వరన్ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణ మాస్టర్ ప్లాన్ ను చంద్రబాబుకు అందించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, సింగపూర్ ప్రతినిధులతో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటల వరకూ సాగే ఈ సమావేశంలో రాజధాని మాస్టర్ ప్లాన్ లో పొందుపరచిన అంశాలపై చర్చించనున్నారు. అంతేకాక రాజధాని కోసం భూములు కేటాయించిన రైతులకు సమీప గ్రామాల్లో ఏపీ ప్రభుత్వం భూములు కేటాయించనుంది.