రాజధాని అమరావతి శంకుస్థాపన ముహూర్తం ఖరారు


 

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యంత అంగరంగా వైభవంగా నిర్వహించాలని ఏపీ ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి వెయ్యిమందికి పైగా అతిధులను ఆహ్వానించనున్నారు. అయితే ఈ నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ముహుర్తం ఖరారు అయింది. దసరా రోజు అంటే అక్టోబర్ 22వ తేదీన మధ్యాహ్నం 12.45 నిమిషాలకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. మందడం- ఉద్దండరాయపాలెం మధ్యలో భూమిపూజ జరిగిన చోటునే శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆ శంకుస్థాపన కార్యక్రమం చేయనున్నారు. గురువారం నాడు జరిగిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు శంకుస్థాపనం కార్యక్రమంపైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.