TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమరావతి శంకుస్థాపన.. ముంబై సంస్థకు టెండర్

Published on: Mon Sep 28, 2015 2:47PM


 

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం దసరా రోజు అంటే అక్టోబర్ 22న ప్రభుత్వం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దీనికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. సింగపూర్ ప్రధాని.. తదితర ఇంకా ముఖ్య అతిధులను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. ఇంత అంగరంగ వైభవంగా చేపట్టదలచిన శంకుస్థాపన కార్యక్రమాన్ని ముంబైకు చెందిన విజ్ క్రాఫ్ట్ అనే సంస్థ దక్కించుకుంది. అమరావతి శంకుస్థాపనకు గాను.. భూమి పూజ నిమిత్తంగాను చేపట్టవలసిన కార్యక్రమాలను సీఆర్డీఏ ఈవెంట్ మేనేజింగ్ ఏజెన్సీలకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో టెండర్ ప్రక్రియను నిర్వహించారు. కానీ దీనిలో రెండు సంస్థలే పాల్గొనగా ముంబైకి చెందిన విజ్ క్రాఫ్ట్ సంస్థ రూ 9.5 కోట్లకు బాధ్యత నిర్వహణలను కైవసం చేసుకుంది.