అమరావతిపై ప్రధానికి ఫిర్యాదులు

posted on: Oct 15, 2015 1:18PM

 

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రధాని నరేంద్రమోడీకి పర్యావరణవేత్తలు ఫిర్యాదు చేశారు, ఏపీ రాజధాని నిర్మాణానికి పర్యావరణ అనుమతులు వచ్చుంటే, దాన్ని గ్రీన్ ట్రిబ్యునల్ కి అందజేసి, వారి అనుమతితో పనులు చేపట్టాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు, ఇవేమీ చేయకుండా ఏపీ ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు పనులు చేపడుతోందని ప్రధాని మోడీకి పర్యావరణవేత్తలు, సామాజికవేత్తలు కంప్లైంట్ చేశారు, పర్యావరణం, ఇతర సమస్యలను పట్టించుకోకుండా రాజధాని నిర్మాణం చేపట్టడం మంచిది కాదని, అమరావతి శంకుస్థాపనకు వచ్చే మోడీ దీనిపై ఆలోచించాలని పర్యావరణవేత్తలు, సామాజికవేత్తలు సూచిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...