రాజధాని గ్రామాల్లో భూ సేకరణ

posted on: May 15, 2015 12:28PM

 


ఏపీ రాజధాని ప్రాంతంలో భూసేకరణతోపాటు భూ సమీకరణలోనూ భుములు ఇచ్చేందుకు రైతులకు అవకాశం వుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో రైతులు భూసేకరణ చట్టంలోకంటే భూ సమీకరణ ద్వారానే ఎక్కువ మేలు జరుగుతుందని అంటున్నారని చెప్పారు. రాజధాని ప్రాంతంలో భూ సమీకరణకు ఇవ్వని భూములను భూ సేకరణ ద్వారా సేకరించాలని కలెక్టర్‌కి ఆదేశాలు జారీ అయ్యాయని ఆయన తెలిపారు. త్వరలోనే ఆ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. కేంద్ర మంత్రుల పర్యటనలో మార్పుల కారణంగానే మంగళగిరి వద్ద ఎయిమ్స్ శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడిందని ఆయన వెల్లడించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...