TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ క్యాబినెట్.. వైసీపీ సమావేశాలు.. ఒకటే అంశాలు

Published on: Wed Dec 16, 2015 11:59AM


 

ఏపీ క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈసందర్బంగా ముఖ్యంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆరు ప్రధాన బిల్లులపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కాల్ మనీ, కల్తీ మద్యంపై ప్రతిపక్షాలను ఎదుర్కోవడం.. కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలు అమలుపరచడం.. జనవరి 1 నుండి ప్రారంభంకానున్న జన్మభూమి విధానాలపై చర్చిస్తున్నారు.

మరోవైపు వైసీపీ నేతలు కూడా సమావేశమయ్యారు. ఈసందర్బంగా వారు అసెంబ్లీలో ఏ అంశాలపై మాట్లాడాలో చర్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కాల్ మనీ, కల్తీ మందు, బాక్సైట్ తవ్వకాలు గురించి చర్చించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈసారి అధికార పార్టీని ఇరుకున పెట్టాలని ప్రతిపక్ష నేతలు, ప్రతిపక్ష నేతలను ఎదుర్కోవడానికి అధికార పార్టీ రెండూ కలసి అసెంబ్లీలో రచ్చ చేస్తారని ముందే అర్ధమవుతోంది.