మండేలా మృతి పట్ల శాసనసభ సంతాపం

posted on: Dec 12, 2013 10:36AM

 

    AP Assembly Nelson Mandela, Nelson Mandela, Winter Session of AP Assembly

 

 

దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, నల్ల సూరీడు నెల్సన్ మండేలా మృతి పట్ల శాసనసభ సంతాపం తెలిపింది. ఈ రోజు ఉదయం శాసనసభ ప్రారంభంకాగానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నెల్సన్ మండేలా సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు నెల్సన్ మండేలా అని, మానవజాతి చరిత్రలో నెల్సన్ మండేలా మహా శిఖరమని కొనియాడారు.తన జీవితాన్ని మండేలా ప్రజలకే అంకితం చేశారని అన్నారు. చంద్రబాబునాయుడు మాట్లాడుతూ..మండేలా త్యాగాల ఫలితంగానే సౌతాఫ్రికాకు స్వాతంత్య్రం లభించిందని అన్నారు. గాంధీ మహాత్ముడికి మండేలా ఏకలవ్య శిష్యుడవడం దేశానికి గర్వకారణమన్నారు. నెల్సన్ మండేలా యుగపురుషుడని చెప్పారు. అలాగే తెరాస, వైకపా, ఎంఐఎం సభ్యులు మండేలాకు సంతాపం తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...