అసెంబ్లీలో గందరగోళం 15 నిమిషాలు వాయిదా
Published on: Tue Sep 1, 2015 10:31AM
.jpg)
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు మంగళవారం ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలను రద్దు చేయాలని ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ డిమాండ్ చేశారు. దీనికి స్పీకర్ తిరస్కరించారు. దాంతో వైకాపా సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించి ఆందోళనకు దిగారు. సభలో ప్లకార్డులు ప్రదర్శించవద్దని, ఆందోళన విరమించాలని స్పీకర్ సభ్యులకు కోరిన వారువినిపించుకోకపోవడంతో సభను 15 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల వెల్లడించారు.


