అనూహ్య కేసులో చంద్రభాన్ కు ఉరిశిక్ష

 

కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య రేప్ అండ్ మర్డర్ కేసులో ముంబై సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అనూహ్యపై అత్యాచారం చేసి హత్య చేసిన క్యాబ్ డ్రైవర్ చంద్రభాన్ కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది, 2014 జనవరి 4న ముంబై రైల్వేస్టేషన్ నుంచి అనూహ్యను బైక్ పై తీసుకెళ్లిన చంద్రభాన్... మార్గమధ్యంలో ఆమెపై అత్యాచారం చేసి చంపేశాడు, అయితే ముంబై రైల్వేస్టేషన్లో దిగిన అనూహ్య ఏమైందో తెలియక తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టడంతో చంద్రభాన్ దురాగతం బయటపడింది, ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహారాష్ట్ర పోలీసులు... ముంబై రైల్వేస్టేషన్లోని సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడ్ని పట్టుకున్నారు, ఇంటరాగేషన్లో చంద్రభాన్ చెప్పిన సమాచారం ఆధారంగా కుళ్లిపోయిన స్థితిలో అనూహ్య డెడ్ బాడీని గుర్తించిన పోలీసులు... బ్యాగ్, ఐడీ కార్డును కూడా స్వాధీనం చేసుకున్నారు, దాదాపు ఏడాదిన్నరపాటు ఈ కేసును విచారించిన ముంబై సెషన్స్ కోర్టు... చంద్రభాన్ ను దో్షిగా నిర్ధారించి ఉరిశిక్ష విధించింది.