మహా కుంభమేళాలో మరో అగ్నిప్రమాదం

posted on: Feb 17, 2025 3:49PM

ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలు సోమవారం (ఫిబ్రవరి 17) అగ్నిప్రమాదం సంభవించింది. కుంభమేళాలో అగ్నిప్రమాదం జరగడం ఇది ఏడో సారి. ఈ సారి సెక్టార్ 8లో మంటలు చెలరేగాయి.

వెంటనే అధికారులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే కుంభమేళాలో తరచూ అగ్ని ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తున్నది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...