Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...24న ఏపీ కేబినెట్ భేటీ
posted on: Feb 19, 2026 8:57AM

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఈ నెల 24న భేటీ కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అధ్యక్షతన జరగనున్న ఈ మంత్రివర్గ సమావేశం స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్ఐపీబీ) ఆమోదించిన రూ.29,021 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయనుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 24 మధ్యాహ్నం 3 గంటలకు వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుందని సీఎస్ విజయానంద్ బుధవారం (ఫిబ్రవరి 18) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేబినెట్ భేటీకి సంబంధించి ప్రతిపాదనలను నిర్ణీత ఫార్మాట్ లో 23వ తేదీలోగా పంపాలని అన్ని శాఖల ప్రధాన కార్యదర్శులకు అధికారిక సమాచారం అందజేశారు. ఇలా ఉండగా ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చిచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


.webp)



