Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఢిల్లీలో ఏపీపై నేడు కీలక భేటీ
posted on: Nov 12, 2014 9:04AM

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో ప్రయోజనాలు అందాల్సి వుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రత్యేక ప్యాకేజీ, అపరిష్కృతంగా వున్న ఇతర అంశాలను చర్చించడానికి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. బుధవారం ఈ సమావేశం జరుగనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రధాని మోడీని కలసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళిన నేపథ్యంలో నిర్మలా సీతారామన్ తాజా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్కి చెందిన కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి, వ్యయ, రెవెన్యూ కార్యదర్శులు, వాణిజ్య కార్యదర్శులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలమీద చర్చ జరుగుతుంది. ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్రంలో పారిశ్రామికీకరణకు పన్నుల ప్రోత్సాహం, 24,350 కోట్ల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని చంద్రబాబు నాయుడు కోరుతున్నారు. అలాగే 2014 - 15 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లోటు 24,811 కోట్లను ప్రత్యేక గ్రాంటుగా అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోరుతోంది. ఈ సమావేశంలో ఈ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం వుంది.






