గవర్నర్ గా నరసింహన్ కి రామ్ రామ్!

posted on: Mar 26, 2018 3:30PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకి గవర్నర్ గా కొనసాగుతున్న నరసింహన్ కి ఉద్వాసన పలికే అవకాశం ఉందని అంటున్నారు. గత కొన్ని రోజులుగా ఏపీ లో రాజకీయ పరిస్థితులు మారిన నేపథ్యంలో, తమకి అనుకూలంగా ఉండేవాళ్ళని అక్కడ గవర్నర్ గా పెట్టడం ద్వారా తమపై విరుచుకుపడుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చెక్ పెట్టొచ్చు అనే ఆలోచనలో ఉన్నారట ఢిల్లీ పెద్దలు. ఇక, తెలంగాణ ప్రభుత్వానికి సన్నిహితంగా మెదలడం కూడా బీజేపీ పెద్దలకి మింగుడుపడని వ్యవహారం గా తయారయ్యింది. తెలంగాణ గవర్నర్ గా మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ సీవీఎస్కె శర్మ పేరు వినిపిస్తుండగా, ఏపీ కి కిరణ్ బేడీ పేరు ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేస్తున్న కిరణ్ బేడీకి అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంతో విభేదాలు ఉన్నాయి. ఆమె ప్రభుత్వం విషయాల్లో జోక్యం చేసుకోవడం వివాదాంశం గా మారింది. అలాంటి వ్యక్తి ని ఏపీ కి తీసుకు వస్తే, చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడెయ్యొచ్చు అనేది వారి ఆలోచనగా కనిపిస్తుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...