తిరుపతికి పవన్ కల్యాణ్..తొక్కిసలాటలో గాయపడిన వారికి పరామర్శ

posted on: Jan 9, 2025 10:48AM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం (జనవరి 9) మధ్యాహ్నం తిరుపతి వెళ్లనున్నారు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల పంపిణీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన ఈ దుర్ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు తిరుపతి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య, ఆరోగ్య శాఖకు సూచించిన పవన్ కల్యాణ్ బాధితులను స్వయంగా పరామర్శించి ధైర్యం చెప్పాలని నిర్ణయించుకున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...