Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విచారణ కోసం కాదు..కాల్ డాటాని భద్రపరచమని కోరేందుకేనట!
posted on: Aug 21, 2015 7:50AM
.jpg)
ఫోన్ ట్యాపింగ్ కేసుపై దర్యాప్తు చేయడానికి నియమించబడిన ఆంద్రప్రదేశ్ సిట్ అధికారులు నిన్న సాయంత్రం తెలంగాణా హోంశాఖ కారదర్శిని విచారణకు హాజరుకమ్మని ఆదేశించేందుకు నోటీసులు ఇవ్వడానికి తెలంగాణా సచివాలయానికి వెళ్ళారని వార్తలు వచ్చేయి. వాళ్ళు వెళ్ళడం, ఆయనకీ నోటీసు ఇవ్వడం వరకు ఆ వార్తలు నిజమే కానీ ఆ నోటీసు విచారణ కోసం మాత్రం కాదు. మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు ఆయనకు సీల్డ్ కవర్లలో అందజేసిన కాల్-డాటా రికార్డులను భద్రంగా ఉంచమని కోరుతూ విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఆయనకు అందజేయడానికే వారు అక్కడికి వెళ్ళారు. ఆంద్రప్రదేశ్ సిట్ అధికారులు సచివాలయానికి వచ్చిన సంగతి తెలుసుకొని సచివాలయంలోని కొందరు ఉద్యోగ సంఘ నేతలు వచ్చి నిరసనలు తెలియజేసారు. కానీ పోలీసులు వారిని అడ్డుకొని సిట్ అధికారులను జాగ్రత్తగా వారి వాహనాల్లో పంపించివేశారు.


.jpg)



