నేడు డిల్లీ వెళ్లనున్న చంద్రబాబు, మంత్రులు

posted on: Jul 9, 2015 8:43AM

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్ దేశ పర్యటన ఈరోజుతో ముగుస్తుంది. అక్కడి నుండి ఆయన నేరుగా డిల్లీ చేరుకొంటారు. ఆయన కొందరు కేంద్రమంత్రులను కలిసి వారితో పెండింగ్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతారు. రాష్ట్ర మంత్రులు అచ్చెం నాయుడు, మాణిక్యాల రావు తదితరులు కూడా ఈరోజు డిల్లీ వెళ్ళబోతున్నట్లు సమాచారం. వారందరూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్రమంత్రులను రాజమండ్రిలో జరగనున్న గోదావరి పుష్కరాలకు రావలసిందిగా ఆహ్వానిస్తారు. మళ్ళీ చాలా రోజుల విరామం తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీ వెళుతుండటంతో ఆయన డిల్లీ పర్యటనపై సర్వత్రా చాలా ఆసక్తి నెలకొని ఉంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...